మృతుల కుటుంబాలకు బియ్యం అందజేసిన మాజీ జడ్పిటిసి…
తంగళ్ళపల్లి నేటిధాత్రి
తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి పడి మృతి చెందిన బంటు ఆనందంకి 50 కిలోల బియ్యం అందజేసిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య సందర్భంగా మాట్లాడుతూ బస్వాపూర్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని నా వంతు సహాయంగా అందజేశానని తెలియజేశారు అలాగే బస్వాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కనక లక్ష్మి లక్ష్మారెడ్డికి 2500 శ్రీనివాస్ రెడ్డికి 2500 చొప్పున నిరుపేద కుటుంబాలకు సహాయం అందజేశామని అంత్యక్రియలు చేసుకొని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం సహాయం కింద 20 వేల రూపాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కర్నె బాలయ్య మాజీ సర్పంచ్ గుడిసెల నీరజ శ్రీనివాస్ గౌడ్ గుడిసెల తిరుపతి దేవయ్య రామ్ రెడ్డి చంద్రమౌళి సురేష్ మల్లయ్య బాబు కనకయ్య దేవయ్య తదితరులు పాల్గొన్నారు