
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)
కమలాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ మౌటం రమేష్ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు.టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని ఇక భవిష్యత్తు లేని పార్టీలో కొనసాగడం కన్నా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మౌటం రమేష్ తెలిపారు. ముదిరాజ్ సంఘం నాయకులు మౌటం రవి, మౌటం పోచెంధర్, కమలాపూర్ ఏకలవ్య సంఘం అధ్యక్షులు దేవరాజు రమేష్, దేవరాజు కుమారస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు,నాయకులు తవుటం రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, చరణ్ పటేల్,దేశిని ఐలయ్య గౌడ్,నాంపల్లి ప్రభాకర్,బొల్లం రాజిరెడ్డి, పుల్లూరి శ్రీనివాసరావు, విష్ణుదాసు వంశీధర్ రావు, పోడేటి బిక్షపతి, జనగాని శివకృష్ణ,ఆన్ కార్ అశోక్, పెరుమాండ్ల పరుశరాములు, ఆడపు శ్రీకాంత్, వైనాల సుభాష్, గొట్టే రవి తదితరులు పాల్గొన్నారు.