గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన మాజీ సర్పంచ్ లు

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని గ్రామ సర్పంచులు పాత పెండింగ్ బిల్లుల కోసం గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేయడం జరిగింది.గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాలు అభివృద్ధి చెందుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో గ్రామాలు 2019 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది.మన తెలంగాణ ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి చేయడం వల్ల దేశంలో తెలంగాణ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో 2019 – 2024 గ్రామ సర్పంచులు అప్పులు తెచ్చి అభివృద్ధి చేయడం జరిగింది.ఇందులో భాగంగా గ్రామపంచాయితి లేగాని పల్లె ప్రకృతి వనాలే గాని అంతర్గత సిసి రోడ్లు, వీధిలైట్లు గాని మన ఊరు మన బడే గాని రైతు వేదికగలగాని స్మశాన వాటికలు గాని పల్లెలు అభివృద్ధి చెందుతూనే మన దేశం బాగుపడదని ఉద్దేశంతో అప్పులు తెచ్చి అభివృద్ధి చేయడం జరిగింది చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇప్పుడున్న ప్రభుత్వం దాటవేత ధోరణితో మమ్ములను ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు, ముస్తాలపల్లి సర్పంచ్ బొట్ల రవీందర్,పులిగిల్ల సర్పంచ్ సదానందం పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!