జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి మాజీ సర్పంచ్ మేడి రవి ని మహిళా సంఘం సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ మేడి రవి సర్పంచ్ పదవి కాలంలో ఉన్నప్పుడు చేసిన సేవలు మరువలేనివి. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు.