
మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన
చిత్తూరు ఎంపి
దగ్గు మళ్ళ ప్రసాద రావు
చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 15:
గంగాధర నెల్లూరు నియోజకవర్గంవెదురుకుప్పం మండలం, గొడుగు చింత గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ నాయుడు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అలాగే ఆయన కుటుంబ సభ్యులకు
ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఢిల్లీ పర్యటన నేపథ్యంలో
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాజీ సర్పంచ్ భాస్కర నాయుడు మరణం వార్తను,టీడీపీ శ్రేణుల ద్వారా తెలుసుకున్నారు.ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
సౌమ్యలైన భాస్కర నాయుడు పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేసారని గుర్తు చేసిన చిత్తూరు ఎంపీ భాస్కర నాయుడు లేని లోటు పార్టీకి తీర్చలేనిదన్నారు.
ఈ విషాద సమయంలో
ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం, శక్తిని ఇవ్వాలని, భాస్కర్ నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు,