
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం యువజన కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ యూత్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో. రోగులను ప్రజలను అన్నదాన ప్యాకెట్లు పంచే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు,