మాజీ ప్రధాని మృతిపట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సంతాపం

నర్సంపేట, నేటిధాత్రి :

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దిగ్భ్రాంతిని గురై విచారం వ్యక్తం చేశారు.అనంతరం సంతాపం ప్రకటించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు.పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరత మాత ముద్దు బిడ్డగా కొనియాడారు.భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చరిత్రాత్మకమన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేసుకున్నారు.
మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరనిలోటని శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!