నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ శుక్రవారం నాడు నగరంలో జరుగుతున్న వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో వరంగల్ భద్రకాళి రోడ్డు, కీర్తి గార్డెన్స్ లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బారాస పార్టీ సీనియర్ కార్యకర్త మాలకుమ్మరి పరుశరాములు కుమార్తె వివాహానికి హాజరైన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో పాటు, గ్రేటర్ వరంగల్ కాశీబుగ్గ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, పులి రజనీకాంత్, నేటిధాత్రి పత్రిక వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ కందికొండ గంగరాజు తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.