భూపాలపల్లి నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని జి ఎమ్ ఆర్ గార్డెన్స్ నందు ఉద్యాన వన & పట్టు పరిశ్రమల శాఖ సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతులకు ఆయిల్ ఫామ్ పంటపై శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఫామ్ ఎలైట్ కంపెనీ ప్రతినిధులు నికోలస్, శ్రీవిజయన్ ఆయిల్ ఫామ్ సాగులో అపార అనుభవం కలిగిన సీనియర్ కన్సల్టెంట్ రంగనాయకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ త్రివేణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి,హార్టికల్చర్ అధికారి సునీల్ మరియు సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గండ్ర గౌతమ్ రెడ్డి మరియు భూపాలపల్లి జిల్లా రైతులు, ఎక్స్టెన్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు…
ఈ కార్యక్రమంలో గండ్ర గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి, మిర్చి,పత్తి పంటలకు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్న తరుణంలో భూపాలపల్లి జిల్లాలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడం కొరకు అశ్వారావుపేట లోని ఆయిల్ ఫామ్ తోటలు,ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని దాదాపు 300 మంది రైతులతో కలిసి వీక్షించడం, పరీక్షించడం జరిగింది.
గత వ్యవసాయ శాఖ మంత్రి మరియు మా నాన్న గారి ప్రోత్సాహంతో మన జిల్లాల్లో మన రైతులకు మనమే ఆయిల్ ఫామ్ మొక్కలు ఇచ్చి, పంట సాగుకు కావాల్సిన మేలుకువలు రైతులకు ఇస్తూ వారికి మంచి దిగుబడి,స్థిర ఆదాయం వచ్చేలా చేద్దాం ఈ రంగంలోకి రావడం జరిగింది.
మనల్ని నమ్ముకున్న రైతులకు నష్టం కలగకుండా ప్రతి మండలానికి ఒక్క ఎక్స్టెన్షన్ అధికారిని నియమించి, రైతులకు ఆయిల్ ఫామ్ సాగు పై సలహాలు సూచనలు అదించడం జరుగుతుంది.
అదే విధముగా ఈ ఎక్సటెన్షన్ అధికారులు సరిగా పని చేస్తున్నారా లేదా తెలుసుకోవడం కొరకు 4 టెలికాలర్లను నియమించి వారి ద్వారా రైతులకు మరింత అందుబాటులో సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ సేవలు అందిస్తుంది.
రైతులకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నాం,మరి ఈ పంటను ఎక్కడ అమ్మాలి,ఎవరు కొంటారు అనే సందేహం ఉంది
అనుమానం ఏమి వద్దు ఈ మొదటి సంవత్సరం 350 ఎకరాల్లో పంట దిగుబడి వచ్చింది, వచ్చే సంవత్సరం 2500 ఎకరాల్లో పంట దిగుబడి వస్తుంది.
చిట్యాల, నైన్ పాక గ్రామంలో సువెన్ ఆగ్రో ఇండస్ట్రీ కంపెనీ 2025 అక్టోబర్ వరకు పూర్తి చేసుకోబోతున్నాం,అప్పటి వరకు ప్రతి మండలంలో ఆయిల్ ఫామ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు కంపెనీనే ప్రతి ఆయిల్ ఫామ్ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు పై జి.ఓ పాస్ చేసినప్పుడు వెంటనే స్పందించిన ప్రభుత్వం నాటి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో వెంటనే ఈ ఆయిల్ ఫామ్ సాగు మన రాష్ట్రంలో ఇంట్రడక్షన్ చేయాలి, ఈ పంట ద్వారా అధిక లాభాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం జరిగింది..
ఈ సంవత్సరం 350 ఎకరాల పంట దిగుబడి వచ్చింది.
మరి మొన్న జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోవడం దానితో పాటు ప్రభుత్వం కూడా మారడంతో రైతుల్లో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.
పంట ఎక్కడ అమ్మాలి,ఎవరికి అమ్మాలి అనే అనుమానం ఉంది.
ఎవరికీ అనుమానం వద్దు మీ ఆయిల్ ఫామ్ పంట సువెన్ ఆగ్రో కంపనీనే ప్రతి మండలం లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ పంటను కొంటుంది అని రైతులకు భరోసా ఇచ్చారు.
అదే విధంగా ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటగా కోకో సార్ గంధం,అగార్ ఉడ్,అవకాడో మంచి ధర కలిగిన మంచి లాభాలు ఇచ్చే పంటలను సాగు చేయవచ్చని నేను కూడా పరకాలలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సేద్యం చేస్తున్న అని తెలిపారు
సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్దతిలో తక్కువ భూమిలో ఎక్కువ అంతర్గత పంటలు వేసి అధిక లాభాలు రైతులు పొందవచ్చని సలహా ఇచ్చారు.
ఆయిల్ ఫామ్ పంట స్థిర ఆదాయం ఇచ్చే పంట అని అన్నారు.
బ్యాంకర్స్ తో మాట్లాడి రైతులకు కావాల్సిన ఋణాలు ఇప్పించడమే కాకుండా మీ ఋణాలు కూడా మేమే బ్యాంక్ వారికి సకాలంలో కడతామని తెలిపారు.