“నేటిధాత్రి” హైదరాబాద్
నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలతో కలిసి భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని రాములవారి ఆశీర్వాదం పొందారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & భద్రాచలం ఎన్నికల ఇన్చార్జి తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, భద్రాచలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మరియు ఇతర బిఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.