దుర్గామాతను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం జడిమల్కాపూర్లో ప్రసిద్ధి చెందిన దుర్గామాత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆలయా దుర్గామాత దేవిని దర్శించుకొని సందర్శించారు.

ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి. గ్రామంలో హరీష్ రావుకు పూలమాలలతో భాజ భాజంత్రీలతో ఘన స్వాగతం పలికారు . గ్రామ నాయకులు భరత్ రెడ్డి ఆయనకు పూలమాలల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు.