
తొర్రూరు మండలం ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి
చీకటయపాలెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాండవుల బిక్షం, బూర్గుల వెంకటమ్మ అలాగే తొర్రూర్ మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పేర్ల పుల్లయ్య, శమంతుల వేణు అలాగే కంటయపాలెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త గోనె చిరంజీవి మరియు చింతలపల్లి గ్రామానికి చెందిన కొండం నరసింహారెడ్డి గారి తండ్రి గారు కొండం వెంకట్ రెడ్డి గారు ఇటీవల మరణించగా ఆయా కుటుంబాలను పరామర్శించి వాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించడం జరిగింది.
వీరి వెంట మండల మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య తొర్రూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ లు పాకనాటి సునీల్ రెడ్డి, శ్రీరామ్ సుధీర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కాళ్లు నాయక్, రాయిశెట్టి వెంకన్న, ప్యాక్స్ డైరెక్టర్ జనార్దన్ రాజు, కర్నే నాగరాజు, ధరావత్ జై సింగ్, తూర్పాటి రవి ,పేర్ల జంపా, లేగల వెంకటరెడ్డి, మంగళంపల్లి ఆశయ్య, నిమ్మల శేఖర్,పయ్యావుల రామ్మూర్తి, మహిళా నాయకురాలు కనకపూడి సుచరిత ,తొర్రూర్ బి ఆర్ స్ సోషల్ మీడియా అధ్యక్షులు యర్రం రాజు, ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.