
Congress leaders
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల సేవలు అభినందనీయం….
మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దివంగత నేత దుగ్యాల శ్రీనివాసరావు సేవలు అభినందనీయమని తొరూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని స్థానిక దుగ్యాల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెల్తూరి మల్లేశం, మిట్ట కోల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలకోట్ల రూపాయలు తెచ్చి తొరూర్ మరియు పాత చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తొర్రూర్ మండలంలో కోర్టు మరియు డిగ్రీ కాలేజ్ సెంట్రల్ లైటింగ్, తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రైతుల కోసం సబ్ స్టేషన్ల నిర్మాణానికి కృషి చేశాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుమాండ్ల.నరేందర్ రెడ్డి , మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు మల్లేశం గౌడ్, దేవరకొండ శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు…