
పట్టా భూమిని ఫారెస్ట్ భూమి అంటున్న ఫారెస్ట్ అధికారి
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలంలోని రాఘవపూర్ గ్రామ శివారులో 326 సర్వే నంబర్లో పర్వతం ఉమా పేరుమీద 9 ఎకరాలు పర్వతం మహేష్ సన్నాఫ్ యాదగిరి పేరు మీద 13 ఎకరాలు భూమి పట్టా కలిగి ఉంది పెన్నింటి లక్ష్మి పేరు మీద నాలుగు ఎకరాలు పట్ట కలిగి ఉంది ఈ భూమి ని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది మాకు పట్టా ఉంది అని చెప్పేసి మేము సాగు చేసుకుంటామని సాగుకు యోగ్యంగా చేసుకుంటున్న భూమిని ఇందులో ఫారెస్ట్ భూమి ఉందని నిలుపుదల చేసిన ఫారెస్ట్ అధికారులు నెల రోజులు అవుతున్న ఇప్పటివరకు ఇది ఫారెస్ట్ భూమిన రెవిన్యూ పట్టాభూమిన అని తేల్చడంలో నిర్లక్ష్యం చేస్తున్న ఫారెస్ట్ మండల అధికారి జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఫారెస్ట్ జిల్లా ఉన్నత అధికారులతో సర్వే నిర్వహించి రెవెన్యూ పట్టా భూమిన ఫారెస్ట్ భూమిన తేల్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పట్టాలో ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఒకవేళ ఫారెస్ట్ భూమి అయితే తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని రెవిన్యూ భూమి పట్టా ఉంది కాబట్టి వారికి కూడా హద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు న్యాయం జరగకపోతే ఆందోళనలకు సిద్ధం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం . యాదగిరి పాల్గొన్నారు