ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు, ఫ్యాన్లు అందించిన అటవీ అభివృద్ధి సంస్థ

డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కుర్చీలు, ఫ్యాన్ లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.సామాజిక సేవా కార్యక్రమం కింద పాఠశాలలకు కావాల్సిన కనీస సౌకర్యాల కల్పన లో భాగంగా అటవీ అభివృద్ధి సంస్థ తమ వంతు కృషి గా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి పేర్కొన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు పర్యటించిన పాఠశాలల కంటే కుందారం పాఠశాల చాలా దీన పరిస్థితిలో ఉన్నదని బాధపడ్డారు. వారికి తెలిసిన స్వచ్ఛంద సంస్థల ద్వారా వారి స్నేహితుల , సహా ఉద్యోగుల ద్వారా విరాళాలు సేకరించి కుందారం గ్రామం పాఠశాలకు అవసరమయ్యే సదుపాయాలను తనకు శక్తి మేరకు చేకూర్చి అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు.
ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి తో పాటు కుందారం పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, ప్లాంటేషన్ మేనేజర్ లు జి.సురేష్ కుమార్ మంచిర్యాల రేంజ్ -1,ఇ.లక్ష్మన్ మంచిర్యాల రేంజ్ -2,వి‌.సునీత బెల్లంపల్లి రేంజ్, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, సూపర్ వైజర్ రాజేష్,వాచర్ సాయి కిరణ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *