
Gangamma Temple in Gantavuur, Tirupati.
గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా మీడియాతో మురుగన్
పలమనేరు(నేటి ధాత్రి) జూలై 23:
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గంట ఊరు తిరుపతి గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి ప్రాయంలో నడిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు గంటా వూరు బీసీ కాలనీ వాసులు ఇదే క్రమంలో భాగంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈరోజు మీడియా సమావేశంలో తెలిపారు వివరాల్లోకి వెళ్తే గడిచిన 20 సంవత్సరాలకు ముందు గంటా వూరు బీసీ కాలనీలో చిన్న ఆలయం ఉండేది అభివృద్ధి చేస్తే ప్రసిద్ధి చెందిన ఆలయంగా అప్పుడే వెలుగులోకి వచ్చేది కానీ ఎవరు అభివృద్ధి చేయకపోవడంతో అలాగే ఉండిపోయింది,ఈ ఆలయాన్ని తమిళనాడు రాష్ట్రానికి
చెందిన మురుగన్ అభివృద్ధి ప్రయాయంలో నడిపిస్తున్నారు,
పలమనేరులో ఉన్న గంగమ్మ గుడి కి దీటుగా తీసుకెళుతున్నారు, ఈ సందర్భంగా ఆయన
మీడియా సమావేశంలో
మాట్లాడుతూ
ఎన్నో కష్టాలు పడుతున్న తనకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ గుడి ప్రాంగణంలో తన ఆర్థిక పరిస్థితుల గురించి ఆవేదన చెందుతున్న తరుణంలో సాక్షాత్తు అమ్మవారు తనకు ఎంతో సహకరించి తన ఆర్థిక ఇబ్బందులను పోగొట్టుందని అప్పటినుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే దేయంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు, అదే క్రమంలో తన ముందు సహకారం అభివృద్ధి కోసం ముందుకు వచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలుపుతూ ఈ గుడికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచే అభివృద్ధి చేసి చూపుతున్నట్లు ఆయన తెలిపారు, ఇప్పటికే దాదాపు ఆలయ అభివృద్ధి చేశామని ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సహకరిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేసి అమ్మవారి ఆలయాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తామని తెలిపారు, ఇందుకు సహకారంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు, ఈ కార్యక్రమానికి గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీ మెంబర్స్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు..