Exam Kits Distributed to 10th Class Students
పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు
( గిఫ్ట్ ఏ స్మైల్ ) ఆధ్వర్యంలో,పెన్స్,ఎగ్జామ్స్ పాడ్స్ పంపిణి
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పెద్దూరులోని
కస్తూరిబ గురుకుల పాఠశాలలో మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు( గిఫ్ట్ ఏ స్మైల్) ఆధ్వర్యంలో పదో తరగతి రాయబోయి విద్యార్థినీ, విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ మరియు పెన్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ వార్డ్ కౌన్సిలర్ దొంతులేని కళ్యాణి అశోకరావు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులు విజయవంతంగా పదో తరగతి పరీక్షలు రాసి, అత్యధిక మార్కులు సాధించి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు గౌరవప్రదంగా ఈ విజయాన్ని అందించాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేకాలి,ఎనిమిదో వాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విడుదల దేవయ్య,మాజీ సర్పంచ్ ఆదేపల్లి దేవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
