రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు TGSWR గురుకుల కళాశాల చిన్న బోనాల నందు డిజిటల్ పేమెంట్స్ మరియు సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారి జయరాజ్ మాట్లాడుతూ ,బ్యాంకింగ్ సేవలను సులభంగా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అని,యూపీఐ పేమెంట్,ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం లావాదేవీలను వినియోగించుకోవాలని అన్నారు.అలాగే వెంకటరమణ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ బెట్టింగ్ అప్స్,లెండింగ్ అప్స్,ఫేక్ వెబ్సైట్లు ,డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాల బారిన పడకుండా అన్ని రకాల లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి అన్నారు.సైబర్ నేరానికి గురైతే 1930 కాల్ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంకు అధికారులు అబ్దుల్ రెహమన్ గారు,జిల్లా లీడ్ బ్యాంకు అధికారి మల్లికార్జున్ ,కళాశాల ప్రిన్సిపాల్ జసిమిన్ థెరిస్సా ,ఆర్ధిక అక్షరాస్యత కౌన్సిలర్స్ పాల్గొనడం జరిగినది.