పంట నష్టపోయిన రైతులకు.!

crops crops

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25000/- నష్ట పరిహారం అందించాలి –

మాజీ పి ఎ సి ఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

మిల్లర్లు రైతులకు సహకరించాలి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలంలో అకాల వర్షం కారణంగా మండలంలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని , పంట చేతికచ్చే సమయానికి రైతులపై పకృతి విలయతాండవం చేసిందని, రెండు రోజులుగా కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఇ పరిస్థితులను విపత్తుగా పరిగణలోకి తీసుకొని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 25000/- అందించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా అధికారులు, జిల్లా మంత్రి చొరవ తీసుకుని రైతులను ఆదుకోవాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు
మిల్లర్లు రైతులకు సహకరించాలని, సివిల్ సప్లై అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు భరోసా కల్పించాలని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!