తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా
భద్రాచలం నేటిదాత్రి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక సరోజిని బుద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి *దొడ్డిపట్ల కోటేష్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.
అన్నదాన కార్యక్రమానికి భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ *తెల్లం వెంకట్రావు అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *బలుసు నాగ సతీష్ , మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి *దొడ్డిపట్ల కోటేష్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ…..
గొప్ప సేవ గుణం కలిగినటువంటి తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్బంగా,సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా సరోజిని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని. మంత్రి పొంగులేటి గారి కార్యాలయం ఇన్చార్జిగా ఉన్నటువంటి దయాకర్ రెడ్డి సమస్యలతో కార్యాలయానికి వచ్చే ప్రజలను ఆప్యాయమైన పలకరింపుతో ప్రజలతో మేక మోతు వారి సమస్యలను తీరుస్తుంటారు. సేవా గుణం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన తుంబూరు దయాకర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారికి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు నిండు నూరేళ్లు తోడుగా ఉండాలని నాయకులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో….
భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దొడ్డిపట్ల సత్య లింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నెం సత్యాలు,ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, భద్రాచల హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి బత్తుల కృష్ణారెడ్డి,ఆర్జి సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జ్ కొత్త శ్రీనివాస్,ఎండి నవాబ్, పగిడిపల్లి వంశీ,మళ్లీ, శీను తదితరులు పాల్గొన్నారు.