రోడ్ సేఫ్టీపట్ల వినూత్న అవగాహన..
దుగ్గొండి ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు
నర్సంపేట,నేటిధాత్రి:
రోడ్ సేఫ్టీ మాసం సందర్భంగా దుగ్గొండి ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా పలువురు వాహనాలదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు పూలు అందజేస్తూ వినూత్నంగా తల సూచనలు తెలిపారు. దుగ్గొండి మండలంలోని గిన్నిబావిలో నర్సంపేట నుండి వరంగల్ ప్రధాన రహదారిపై వెళ్లే ద్విచక్ర వాహనాల వాహనదారులకు ట్రాఫిక్ నియంత్రణ గురించి అవగాహన కల్పించినట్లు ఎస్సై తెలిపారు. వాహనదాలకు పుష్పగుచ్చాలు,పూలబొకేలు పోలీసు సిబ్బందితో కలిసి అందజేసి శుభాకాంక్షలు తెలిపామన్నారు.