చందుర్తి, నేటిధాత్రి:
మండల కేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఆవరణలో అయోధ్య శ్రీ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రీరామచంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ పులి రేణుక సత్యం, యువకులు ముందుకు వచ్చి కార్యక్రమం నిర్వహించారు బిజెపికి చెందిన స్థానిక ఉప సర్పంచ్ సిర్రం తిరుపతి పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను మహాలక్ష్మి ఆలయంలో కట్టి వివాదాన్ని సృష్టించారు పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఆలయ ప్రాంగణంలో కట్టి రాజకీయం చేయడం తగదని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలుసుకున్న స్థానిక సీఐ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని కట్టిన ఫ్లెక్సీలు తీసి వివాదాన్ని సద్దుమనగా జేశారు