
Flag Festival
ప్రభుత్వం జూనియర్ కళాశాల లో ఘనంగా జెండా పండుగ
పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 15నాడు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ జెండావిష్కరించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ స్వతంత్రం కోసం మనము 1857 నుంచి 1947 వరకు పోరాటం చేసి ఆ పోరాటంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయడం జరిగిందని తద్వారా మనకు స్వతంత్రం సిద్ధించింది కావున ప్రతి విద్యార్థి తప్పకుండా స్వతంత్ర పోరాట యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈరోజు మనము కళాశాలలో ఉచిత విద్య మరియు ఉచిత హాస్టల్స్ గురుకులాలు స్కాలర్షిప్ సౌకర్యము పొందుతున్నాము విద్యార్థులందరూ దేశ రక్షణ కోసం అందరూ పాటుపడాలని ఉత్తమ పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు కళశాల సిబ్బంది పాల్గొన్నారు.