— పాప పేరు మీద
25 వేలు ఫిక్స్ డిపాజిట్
నిజాంపేట, నేటి ధాత్రి:
బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముస్తఫా అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి నిజాంపేట మండల కేంద్రం లో గల పార్టీ కార్యాలయంలో సొంతగా 25 వేల రూపాయలు ముస్తఫా కూతురు పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కొండల్ రెడ్డి, మవురం రాజు, రవి, నర్సీములు, బాల్ రెడ్డి,నాగరాజు,రాములు, చింతల స్వామి, ఎల్లం యాదవ్, దుర్గయ్య, నాని, మైసయ్య తదితరులు పాల్గొన్నారు తదితరులు ఉన్నారు.