Ashes Test Win Brings Huge Loss to Australia
తొలి టెస్టు గెలుపు.. ఆస్ట్రేలియా క్రికెట్కు భారీ నష్టం
యాషెస్ 2025 సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వచ్చిందట. రెండు రోజుల్లోనే ఆట ముగియడంతో ఈ నష్టం వాటిల్లింది.
యాషెస్ 2025 సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ట్రావిస్ హెడ్(Travis Head) విధ్వంసకరమైన బ్యాటింగ్ తో మ్యాచ్ రెండో రోజే ముగిసింది. దీంతో ఐదు మ్యాచుల యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించడం సంతోషమే అయితే.. మరోవైపు ఆసీస్ బోర్డుకు మాత్రం భారీ నష్టాన్ని తీసుకొచ్చింది.
