కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

మచ్చ సుమన్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు

పరకాల నేటిధాత్రి
వరంగల్- ఖమ్మం నల్గొండ- పట్టభద్రుల తీన్మార్ మల్లన్నకు ఓటు వేసిగెలిపించాలని పరకాల పట్టణ యూత్ కాంగ్రెస్ మచ్చ సుమన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పరకాల పట్టణంలోని కోర్టు ఆవరణంలోని న్యాయవాదులను లక్కం శంకర్,అకినపల్లి రవికుమార్, దేవులపల్లి సాయికుమార్ లను తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్బంగా మచ్చ సుమన్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కేసీఆర్ ప్రభుత్వాన్ని తీన్మార్ మల్లన్నకు జవాబు తీసుకువచ్చే అవకాశం ఇవ్వండి ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోకుండా ప్రశ్నకు జవాబు తీసుకువచ్చే అత్త ఉన్న వ్యక్తి కాబట్టి పట్టభద్రులు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్క కిరణ్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి 10 సంవత్సరాలు కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు దానికి టిఆర్ఎస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న మీద 64 కేసులు రెండుసార్లు 120 రోజుల జైలు జీవితం గడిపేలా చేశాడు కెసిఆర్ మల్లన్న కూతురు వికలాంగురాలు ఆ పాప మల్లన్న లేకుండా ఒక్కరోజు కూడా నిద్రపోదు అలాంటి సందర్భంలో కూడా మల్లన్న వెనుకడుగు వేయకుండా కేసులకు భయపడకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేశాడు అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ చందుపట్ల రాజిరెడ్డి,యూత్ కాంగ్రెస్ పరకాల పట్టణప్రధాన కార్యదర్శి బాసాని సుమన్, కొడపాక సాయి,కత్తి తిరుపతి, వినయ్,నరేష్,కృష్ణ కాంత్,శ్రీరామ్,రాజు,రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *