మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో అగ్నిప్రమాదం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది.పరిశ్రమలోని ఆటోమోటివ్ డివిజన్ ప్లాంట్లోని స్టోరూమ్లో మంటలు చెలరేగాయి. ప్లాంట్ నుంచి దట్టమైన పొగలు వెలువడంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిశ్రమలోని ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిన అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కార్మికులు, ఉద్యోగులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.