-దాతల సహకారంతో రూ.10వేల చెక్ అందించిన
-మై వేములవాడ చారిట్రబుల్ ట్రస్ట్
వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కొనాయిపల్లికి చెందిన వేదిరే గణేష్ గౌడ్ అనే యువకుడు హై ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నిరుపేద కుటుంబానికి చెందిన గణేష్ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న మై వేములవాడ చారిట్రబుల్ సభ్యులు శనివారం రోజున వారి ఇంటికివెళ్ళి రూ 10వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ట్రస్టు సభ్యులు గణేష్ త్వరగా కోలుకుంటారని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, డాక్టర్. బెజ్జంకి రవీందర్, తాళ్ళపల్లి ప్రశాంత్, పొలాస రాజేందర్, ప్రతాప నటరాజు, తోట రాజు,గొట్టే మనోహర్, చల్లా సత్తయ్య, ఎరువ భూమరాజు, వీరగొని ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.