మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం.

Financial

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

తలకొండపల్లి /నేటి ధాత్రి

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి లో పెద్దూర్ తాండ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సభావత్ తారబాయి శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న తలకొండపల్లి మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ… తమ ట్రస్టు ద్వారా తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి ద్వారా రూ.3 వేల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపిటిసి రఘు నాయక్, మాజీ సర్పంచ్ సక్రి కిషన్ నాయక్, మాజీ వార్డు మెంబర్లు రవి, పుల్యి , రమేష్ గ్రామ పెద్దలు టిక్యి నాయక్, రమేష్ నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, దస్రు నాయక్, శ్రీనివాస్ ,కృష్ణ తదితరులు వివిధ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!