
Financial assistance to the family of Janne Anji, who was injured in an electrical accident,
విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జన్నే అంజి కుటుంబానికి ఆర్థిక చేయూత,
– 5000 రూపాయలను అందించిన జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలు మారుతి.
నేటి ధాత్రి- మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నె అంజి అనే విద్యుత్తు తాత్కాలిక ఉద్యోగి ఈనెల మూడవ తేదీన ప్రమాదవశాత్తు విద్యుత్తు పోలు నుండి విద్యుత్ షాక్ తగలడం వలన కిందపడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు ప్రస్తుతం హైదరాబాదు యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం పొందుతున్నాడు,
గాయపడిన జన్నె అంజి నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది జన్నె అంజి తండ్రి సైతం మంచాన అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉండటంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది మొట్లపల్లి సబ్స్టేషన్లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న జన్నె అంజి కి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకపోవడంతో.. అంజికి మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా తయారయింది. అంజి దయనీయ పరిస్థితి గురించి వివిధ పత్రికలలో కథనాలు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధినేత ఐలు మారుతి స్పందించి బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించాడు అంతేకాకుండా భవిష్యత్తులో తన వంతు సహాయంగా చేతనందిస్తానని భరోసా ముట్లపల్లి తాజా మాజీ సర్పంచ్ నరహరి పద్మా వెంకటరెడ్డి 5000 రూపాయలను అందించగా బజ్జూరి వేణుగోపాల్ వెయ్యి రూపాయలు బజ్జూరి వీరన్న పెడిసిల్ల 1000 రూపాయలు గూడూరి రఘుపతి రెడ్డి 1000 రూపాయలు శ్రీ పల్లి రాజేష్ 2000 రూపాయలు దర్శనాల సురేష్ 2000 రూపాయలు టేకుమట్ల లైన్మెన్ రఘు వెయ్యి ఇలా చాలామంది దాతలు స్పందించి బాధిత కుటుంబానికి అందించి తమ ఔదార్యాన్ని చాటారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలు మారుతి. ఆలయ కమిటీ చైర్మన్ గూడూరు రఘుపతి రెడ్డి బజ్జూరి వేణుగోపాల్ బజ్జూరి వీరన్న సీనియర్ జర్నలిస్టు రాళ్ల బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,