కాంగ్రెస్ పార్టీకార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.
కల్వకుర్తి/నేటి దాత్రి:
కల్వకుర్తి నియోజక వర్గంలో కర్కల్ పహాడ్ గ్రామానికి చెంది ఎమ్మెల్యే అనుచరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిలివేరు శ్రీను గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇవాళ ఉదయం శ్రీను భార్యను పిల్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంటికి పిలిపించుకుని మీకు మేము పార్టీ అండగా ఉంటుంది ఎవ్వరు అదర్యపడొద్దని భరోసా ఇచ్చి అపద్ధర్మం కింద కొంత రూ. 2 లక్షల ఆర్థిక సహాయ అందించారు . తన పిల్లల మంచి భవిష్యత్తు పై చదువులకోసం సహాకారం చేస్తా అన్నారు శ్రీను తనకోసం చాలా కష్టపడి పనిచేశాడు గుర్తుకు చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం అని కుటుంబ సభ్యులను భరోసానిచ్చారు.