వరంగల్ జిల్లా/గీసుగొండ,నేటిధాత్రి :
గీసుకొండ మండలం మనుగోండ గ్రామానికి చెందిన సుమన్ అనారోగ్యం తో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు.కాగా సుమన్ ఆర్థిక స్తోమత లేకపోవడంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అల్లం బాల కిషోర్ రెడ్డి సహకారంతో కుటుంబానికి 10 వేల రూపాయలను ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్,గీసుకొండ యూత్ మండల అధ్యక్షుడు అకుల రుద్ర ప్రసాద్, మనుగోండ గ్రామ పార్టీ అధ్యక్షులు కందికొండ రాజు, కార్యదర్శి అనిల్, మండల కాంగ్రెస్ నాయకులు మందాసి రాంబాబు,ఎంబడి మహేందర్,మర్రి కాంతి పరమేష్,మల్లేష్,తోట కమలాకర్,కందికొండ రాజకుమార్, దేవానగరాజు,కందికొండ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.