మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం

నర్సంపేట,నేటిధాత్రి :

వారి చిన్ననాటి స్నేహితుడు ఇటీవల మృతిచెందగా శుక్రవారం ఆయన దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందజేశారు.నర్సంపేట పట్టణంలోని జి ఆర్ గార్డెన్ సమీపంలో ఇటీవల మృతి చెందిన సకినాల కుమారస్వామి దశదినకర్మలో తన 1 తరగతి నుండి 7 తరగతి వరకు చదువుకున్న పూర్వపు విద్యార్థులు వరకు బొంద బడి 1983, 10 తరగతి వరకు జెడ్ పి హెచ్ ఎస్ బాలుర హై స్కూల్ 1984/85 లో కలిసి చదువుకున్న స్నేహితులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మిత్రుడు కుమారస్వామికి భార్య ముగ్గురు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు వివాహము జరిగినది. రెండవ కూతురు అనారోగ్యంతో గతంలో మృతిచెందగ మూడవ కూతురు ఎంబీఏ చదువుకుంటున్నది.కాగా మిత్రుడు కుమారస్వామి కుటుంబ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఆ కుటుంబానికి1 లక్షా 5వేల 116 ఆయన చిన్న కూతురు పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా మిత్రులు వారి కుటుంబానికి నిత్యం సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *