హసన్పర్తి (నేటిదాత్రి ) :
ఆదివారం రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇటీవల మృతి చెందిన చుంచు సురేష్ గారి ఇంటికి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు. సురేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని, చిన్న వయసులోనే చుంచు సురేష్ గారు మరణించడం వారి కుటుంబానికి తీరని లోటు అని శ్రీ నాగవల్లి రమేష్ , శ్రీ వెన్నపురెడ్డి జగన్ ,పోరిక స్వప్న రాజు నాయక్(బీజేపీ కంటెస్టెడ్ అభ్యర్థి) మేకల చంద్రబాబు, కాగితోజు అఖిలేష్, అభిలాష్, సూరం రంజిత్, తిరుమల్, నితిన్ గారు నివాళులు అర్పించారు మరియు బిజెపి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు వారికి ఆర్థికంగా 25 వేల రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా, వచ్చే విద్యా సంవత్సరం జూన్ లో వారి పిల్లలకు కావలసిన నోట్స్ బుక్స్ కూడా ఇస్తామని పోరిక స్వప్నరాజు నాయక్ గారు సురేష్ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది.