*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *

Financial assistance Financial assistance

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *
మొగుళ్ళ పల్లి: నేటి ధాత్రి

 

సొంత రక్తసంబంధీకులే వివిధ కారణాలతో విడిపోయి..గొడవలు పడి..మానవత్వ విలువలను మంటగలుపుతున్న తరుణంలో..తోటి స్నేహితుడి తండ్రి మరణం పట్ల స్పందించి..ఆర్థిక సహాయాన్ని అందించి..తోటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నవీన్ తండ్రి కుమ్మరి సమ్మయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా 2012-2013 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన కుమ్మరి నవీన్ స్నేహితులు జన్నే రాజ్ కుమార్, ఇల్లందుల విజయ్ కుమార్, బొచ్చు ప్రకాష్, నాగన బోయిన రాకేష్ యాదవ్, వైనాల అజయ్, బొచ్చు రాజు, తంగళ్ళపల్లి హరీష్, జన్నే రేష్మ, కట్ల మమత, వనపర్తి రుతీష, చల్ల మమత, పోతరాజు జ్యోతి, పసరగొండ శ్రీలత, గాదే రమ్య, చేపూరి రజిత, వైనాల శిరీషలు విరాళాలుగా వేసుకుని 5000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!