నిరుపేద వివాహానికి ఆర్థిక సాయం..
రామాయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)
నిరుపేద కుటుంబ వివాహానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన నిరుపేద డేవిడ్ కూతురు వివాహానికి కటారెడ్డి తిరుపతిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తన అనుచరులతో నిరుపేద కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంట తిరుపతిరెడ్డి శుభ, ఆశుభ కార్యక్రమాలకు తనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో.శ్యామ్ రెడ్డి,రాజ గుప్త బిక్షపతి ,సుధాకర్,దేవేందర్,సంతోష్ జి స్వామి,సాయిలు, సాయిలు,సిద్దయ్య నవీన్,నారాయణ తదితరులు పాల్గొన్నారు