చలి వాగు ఆయకట్టు కాలువ గండిని వెంటనే పూడ్చండి

పొట్టకొచ్చిన వరిచేనుల రైతుల ఆందోళన
శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం జోగం పల్లె గ్రామ శివారులో ఉన్న చలి వాగు ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు కాలువకు పడిన గండిని నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే మరమ్మత్తు చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు ఈరోజు కాంగ్రెస్ మండల నాయకులతో కలిసి ఆయకట్టు కాల్వకు పడిన గండిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయకట్టు కాలువకు గండిపడి 10 రోజులు కావస్తున్న ఇప్పటివరకు సంబంధిత నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అధికారులతో సమీక్ష చేయకపోవడం దురదృష్టకరమన్నారు. చలి వాగు ప్రాజెక్టు కింద సుమారుగా 4 వేల ఎకరాల ఆయకట్టు ఉందని ప్రస్తుతం ఉన్న వరి పంట పొట్ట దశలో ఉండి నీరు అధిక మొత్తంలో తీసుకుంటుందని ప్రస్తుతం పంటకు నీరు అందించకుంటే రైతులకు తీవ్ర పంటనష్టం కలుగుతుందని సంబంధిత అధికారులు వెంటనే పూడ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు గత కాంగ్రెస్ హయాంలోనే చలి వాగు ప్రాజెక్ట్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష జరిపి వెంటనే కాల్వకు పడిన గండిని పూడ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు తడుక కుమారస్వామి ఏరుకొండ శంకర్ లక్ష్మి నారాయణ పల్లెబోయిన శ్రీనివాస్ ప్రభాకర్ అశోక్ గుండె ప్రవీణ్ మామిడి ప్రవీణ్ దౌపతి సమ్మిరెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!