కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఈ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో పండగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బెంగుళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు పూర్తిగా కాలిపోవడంతో అందులోని 17 మంది సజీవదహనం అయినట్లు సమాచారం.
