పంటలు పరిశీలించి…… రైతులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే
పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దు
ఎమ్మెల్యే సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన మొక్కజొన్న అరటి చెట్లు అధికారులతో కలిసి పరిశీలించి,అకాల వర్షంతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దు వారికి ప్రభుత్వం అండగా ఉంటుం దని అన్నారు అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలు చూసి ఎమ్మెల్యే అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు అని అన్నారు. అయితే అకాల వర్షాలు పంటలకు నష్టం కలిగించే అన్న విషయాన్ని గుర్తించి వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం నష్టపోయిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుతం తాము రైతులకు నష్టపోకుండా కృషి చేస్తామని అన్నారు. రైతులకు నష్టపరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు
అతి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు… లబ్ధిదారులకు ఐదు లక్షలు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరిబీ హటావో నినాదం తెచ్చారు పెద్దరికం తొలగిపో వాలని అన్నది ఆమె ఉద్దేశం. ఇప్పటికీ మనదేశంలో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు.ఇందిరాగాంధీ ఆశయంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పథకం తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో వేగం పెంచాలి. మండలంలోని అన్ని గ్రామాల్లో కమిటీలు నిర్వహించి వారి నుండి నిరుపేదల ఇండ్ల జాబితాను అతి త్వరలో నా దగ్గరికి పంపాలని అన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరగాలని అన్నారు. ఒకవేళ తప్పుగా చేస్తే అధిష్టానం శిక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి, బాసని చంద్ర ప్రకాష్

మార్కండేయ,చిందం రవి,భాసని శాంత- రవి , రవిపాల్ ,దుబాసి కృష్ణమూర్తి రాజు ,కట్టయ్య, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, వలిఐధర్, ఎండి రఫీ, మండల నాయకులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు