‘రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు’
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, బాలానగర్, మొదంపల్లి, మోతీ ఘనపూర్, హేమాజీపూర్ గ్రామాలలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్వినీ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో.. డబ్బులు జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, ఆది రమణారెడ్డి, లింగారం యాదయ్య గౌడ్, బత్తుల రాఘవేందర్, భాస్కర్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.