రైతులు దళారులను నమ్మి మోసపోకండి.
భూభారతి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తాం..
తహసిల్దార్ ఇమామ్ బాబా.
చిట్యాల నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ బుదవారం రోజున నేటిదాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ చిట్యాల మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలలో ఈనెల 3 తారీఖు నుండి 20వ తారీకు వరకు రెవిన్య సదస్సులు నిర్వహించడం జరిగిందని ఈ రెవెన్యూ గ్రామంలోని రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను దరఖాస్తు రూపంలో వారి ఊరిలో జరిగిన రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులకు ఇవ్వడం జరిగింది, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సర్వే చేసి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని అన్నారు, అలాగే కొందరు దళారులు భూములను పట్టా చేయిస్తామని నమ్మబలుకుతున్నారని తమ దృష్టికి వచ్చింది అని వారిని నమ్మి మోసపోవద్దని ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే తహసిల్దార్ కార్యాలయంలో నేరుగా నన్ను సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరినారు, అలాగే ఇప్పటివరకు జరిగిన రెవెన్యూ సదస్సులలో 16 గ్రామాల నుండి దాదాపు 5570 దరఖాస్తులు రావడం జరిగిందని ఇప్పటివరకు దాదాపు 5వేల దరఖాస్తులను స్కాన్ చేసి ఆన్లైన్ చేశామని ఆగస్టు 15 లోపు దరఖాస్తులను గ్రామాల వారీగా పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు పట్టా చేయడం జరుగుతుందని అలాగే భూభారతి అనేది నిరంతర ప్రక్రియని అని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఒక హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని మండలంలో ఇంకా భూభారతిలో ఇవ్వని రైతులు నేరుగా తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డిస్క్ లో దరఖాస్తు లు ఇవ్వాలని తెలిపారు ,అలాగే ఇప్పటివరకు 16 రెవెన్యూ గ్రామాలలో వచ్చిన దరఖాస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నవి, చైన్ పాక గ్రామ సభలో 156 హెల్ప్ డెస్క్ లో 170, చల్లగరిగె గ్రామ సభలో 126 హెల్ప్ డెస్క్ లో 153, చిట్యాల గ్రామ సభలో 126 హెల్ప్ డెస్క్ లో 195, దూత్ పల్లి గ్రామ సభలో 109 హెల్ప్ డెస్క్ లో 90, గిద్ద ముత్తారం గ్రామసభలో 99 హెల్ప్ డెస్క్ లో 79, గోపాలపూర్ గ్రామసభలో 176 హెల్ప్ డెస్క్ లో 65, జడల్ పేట గ్రామసభలో 264 హెల్ప్ డెస్క్ లో 200, జూకల్ గ్రామసభలో 269 హెల్ప్ డెస్క్ లో 147 ,కైలాపూర్ గ్రామసభలో 126 హెల్ప్ డెస్క్ ల 64, కాలువ పళ్లి గ్రామసభలో 40 హెల్ప్ డెస్క్ లో 19, ముచిని పర్తి గ్రామసభలో 250 హెల్ప్ డెస్క్ లో 86, నవాబుపేట గ్రామసభలో 350 హెల్ప్ డెస్క్ లో 182,నైన్ పాక గ్రామసభలో 787 హెల్ప్ డెస్క్ లో 159, తిరుమలపూర్ గ్రామసభలో 189 హెల్ప్ డెస్క్ లో 35, వెంచరామీ గ్రామసభలో 42 హెల్ప్ డెస్క్ లో 35, ఒడితల గ్రామసభలో 417,ఈఈ గ్రామాలలో ఇప్పటివరకు వచ్చినదరఖాస్తులు, గ్రామ సభలలో ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇచ్చామని దాని ద్వారా దరఖాస్తుదారులు వారి స్టేటస్ ను పరిశీలించుకోవచ్చని తెలిపారు, అలాగే ప్రభుత్వం దరఖాస్తులను మూడు కేటగిరీలుగా విభజించి పరిశీలించి అర్హులైన వాళ్లకు పట్టాలు జారీ చేయడం జరుగుతుందని అన్నారు మొదటిది ,2014 కన్నా ముందు రైతులు భూములు కొనుగోలు చేసి 2018 లో సాదా బైనమకింద ఆన్లైన్ చేసిన రైతులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలించడం, రెండవది 2014 తర్వాత కొనుగోలు చేసిన భూములను సాదా బైనమ కింద ఆన్లైన్ చేయని దరఖాస్తులను పరిశీలించడం, మూడవది ప్రభుత్వ భూములను నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్నా భూములను పరిశీలించి ప్రభుత్వం అసైన్ కమిటీలను వేసిన తర్వాత వాటి దరఖాస్తులనుకూడా పరిశీలించడం జరుగుతుందని అన్నారు, అలాగే ప్రభుత్వ భూములను అమ్మిన కొన్న నేరమని దళాల నమ్మి మోసపోవద్దని అన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రైతులకు ఒక వరం లాంటిదని కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.