వరదకు అడ్డుగా హైవే నిర్మాణం

Farmers Farmers

వరదకు అడ్డుగా హైవే నిర్మాణం

పంట పొలాలు కుంటలుగా మారుస్తారా అంటూ రైతుల ఆందోళన

గ్రీన్ ఫీల్డ్ హైవే మహమూద్ పట్నం చెరువును మింగేస్తుందా

చెరువులోకి వర్షం నీరు చేరేదెలా…?

కేసముద్రం/ నేటి ధాత్రి :

 

టీ వలే నూతనంగా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలోనే ఉన్నటువంటి త్రాగునీటి సాగునీటి చెరువు సుమారు 250 ఎకరాల పంట పొలాలకు నిరంధించే సామర్థ్యం గల చెరువు నేడు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను చెరువు పక్కనే నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి, చెరువు పక్కన ఉన్నటువంటి సుమారు 70 ఎకరాల పంట పొలాల మీదుగా వర్షపు నీరు చెరువులోకి చేరుతుందని గ్రీన్ ఫీల్ హైవే నిర్మాణ పనులు వరద నీరు చెరువులోకి చేరకుండా అడ్డుగా రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధిత రైతులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు మొదలుపెట్టిన నాటి నుండి పలుమార్లు వరద నీరు చెరువులోకి చేరేలా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్కు తెలిపామని రైతులు అన్నారు. సుమారు 70 ఎకరాల పంట పొలాలు కుంటలుగా మారే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నామని ఈ సంవత్సరం వర్షాకాలం ముందుగానే వర్షాలు కురుస్తుండడంతో పైనుండి వచ్చే వరద మా పంట పొలాలనే నిలుస్తుందని, మహమూద్ పట్నం చెరువు కింద పంట పొలాలు సుమారు 250 ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ భూములకు నీరు అందిస్తుందని గ్రీన్ ఫీల్డ్ హైవే వరదకు అడ్డుగా నిర్మాణం జరుగుతుందని అందుచేత చెరువులోకి వరద నీరు చేరేదెలా అంటూ రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థను ప్రశ్నిస్తున్నారు.

Farmers
Farmers

పై నుండి వచ్చే వర్షపు నీరు సజావుగా చెరువులోకి పోవాలంటే గ్రీన్ ఫీల్డ్ నిర్మాణ పనులలో ముందుగా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గురువారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థ ప్రతినిధి శ్రీరామ్ ఘటన స్థలానికి చేరుకొని రైతులు కోరినట్టుగా ముందుగా కల్వర్టు నిర్మాణ పనులను రెండు మూడు రోజులలో ప్రారంభిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మిట్ట గడపల యాకూబ్, తరిగి నవీన్, బొద్దుల వెంకట మల్లు, రాపోలు శ్రీనివాస్, పోలు నరసయ్య, దేశ బోయిన అనిల్, ఎలిజాల యాకయ్య, కాసోజు విజయ్, పోలు మురళి, చిలువేరు రవీందర్, గణేష్, శివాజీ, సామా అశోక్, పోలె పాక కమలాకర్, బత్తుల సుభాష్, పిట్టల విజేందర్, మూడ వత్ మాంజ, మోతిలాల్, మాదరపు పుల్లయ్య, పెరుమాండ్ల నవీన్, పిట్టల ఉపేందర్, పెరుమాండ్ల జానీ పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!