ఫార్మర్ రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకోవాలి
మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి
నిజాంపేట నేటి ధాత్రి:
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రైతు రిజిస్ట్రేషన్ కార్డును సద్వినియోగం చేసుకోవాలన్నారు. దానికి కావాల్సిన ఆధార కార్డు, పట్ట పాస్ బుక్, లింక్ అప్ మొబైల్ నెంబర్ ను వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందివ్వలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అధికారులు రైతుల నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభించడం జరిగిందన్నారు.