
Bull dies accidentally
ప్రమాదవశాత్తు ఎద్దు మృతి
బోరన వినిపించిన రైతు ఎల్లయ్య
#నెక్కొండ ,నేటి ధాత్రి:
మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన రైతు బైరు ఎల్లయ్య వ్యవసాయ పనుల నిమిత్తం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పనులు ముగించుకొని వస్తున్న సమయంలో మడిపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ లోతుగా ఉండడంతో అకాల వర్షాలకు కురిన వర్షపు నీరు రైల్వే అండర్ బ్రిడ్జి లో ఎక్కువగా ఉండడంతో పాడి ఎద్దు మృత్యువాత పడినట్టు రైతు బైరు ఎల్లయ్య తెలిపారు. వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉన్న ఎద్దు మృత్యువాత పడడంతో రైతు బైరు ఎల్లయ్య బోరుణ విలపించారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.