Farmer Injured in Electric Shock, Villagers Stage Protest
విద్యుత్ షాక్ తో రైతుకు గాయాలు గ్రామస్తుల ధర్నా
నిజాంపేట: నేటి ధాత్రి
ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఒక రైతు ప్రాణాల మీదకు తెచ్చింది. రజాక్ పల్లి గ్రామానికి చెందిన వోజ్జ పరశురాములు విద్యుత్ షాక్ కు గురవడంతో రెండు చేతులు కాలిపోయాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తెగేసి చెప్పారు.
