ముద్దసానికి కడసారి వీడ్కోలు.

Farewell Farewell

ముద్దసానికి కడసారి వీడ్కోలు

నివాళులర్పించిన టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి

నెక్కొండ నేటి ధాత్రి:

చెన్నారావు పేట ప్రాథమిక సహకార సంఘం సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి శుక్రవారం గుండె పోటుతో హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విలువగా విషయం తెలుసుకున్న నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో ని సత్యనారాయణ ఇంటికి చేరుకొని మృతదేహం పై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి మృతి చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, ఎస్టి జిల్లా సెల్ ఉపాధ్యక్షుడు తిరుమల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు చల్ల పాపిరెడ్డి, కెవి సుబ్బారెడ్డి, రావుల మైపాల్ రెడ్డి, ఎండి అన్వర్ పాషా, కుసుమ చెన్నకేశవులు, ముదిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుముల శ్రీధర్ రెడ్డి, మట్ట బిక్షపతి, భూమాణి మధు, కోటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Farewell
Farewell

సత్యనారాయణ మృతి ఎంతో బాధాకరం : మారం రాము, కొమ్ము రమేష్ యాదవ్

చెన్నారావుపేట సొసైటీ మాజీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి మృతి చెందిన ఘటన తెలుసుకున్న నెక్కొండ మాజీ సొసైటీ చైర్మన్ మారం రాము, నర్సంపేట బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్ లు సత్యనారాయణ మృత దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మారం రాము మాట్లాడుతూ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి అందరినీ కలుపుకు పోయి ఆప్యాయంగా పలకరించే వ్యక్తి సత్యనారాయణ రెడ్డి అని సత్యనారాయణ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మనోవేదనకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, ఈదునూరి యాకయ్య, ఖలీల్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!