ఎంపీడీఒ సురేందర్ కు ఘన వీడ్కోలు

రేగొండ,నేటిధాత్రి:

గత మూడు సంవత్సరాలుగా మండల ఎంపీడీవోగా సేవలందించిన జి.సురేందర్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పదవీ బదిలీ పై వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో సురేందర్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు హాజరై ఎంపీడీవో తో ఉన్న సంబంధాన్ని ఆయన మండల అభివృద్ధి కోసం కృషి చేసిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు.సభకు ఎంపీపీ పున్నం లక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంపీడీవో గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వృత్తిలో నిమగ్నమై మండల అభివృద్ధి కొరకు ఎంపీడీవో సురేందర్ ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు. కిందిస్థాయి ఉద్యోగుల పట్ల ప్రేమాభిమానాలు చూపుతూనే వృత్తి విషయంలో మాత్రం కచ్చితంగా వ్యవహరించేవారని ఆమె గుర్తు చేశారు.ఇలాంటి అధికారి బదిలీపై వెళ్లడం బాధాకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు తప్పవని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ గడ్డం రాంప్రసాద్ రావు, ఎంఈఓ ప్రభాకర్,ఏవో వాసుదేవరెడ్డి,సీనియర్ అసిస్టెంట్ సతీష్ టైపింగ్ విజయ్, ఏపిఓ జహీర్ పాషా వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు పాతపల్లి సంతోష్,భుఖ్యనాయక్,ఎంపీటీసీ అయిలి శ్రీధర్ గౌడ్,కార్యదర్శులు, టెక్నిక్ అసిస్టెంట్ లు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!