శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో తన కర్తవ్యాన్ని నెరవేర్చిన దుర్గం సారమ్మను ఘనంగా సన్మానించారు. మంగళవారం రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ చేసిన సందర్భంగా సింగరేణి ఆఫీసర్లు,తోటి కార్మికులు ఘనంగా సన్మానించారు. పిల్లల చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో తను కుంగిపోకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని తపనతో వారిని ఉన్నత చదువులు చదివించి వారికి మంచి భవిష్యత్ అందించారు. సారమ్మకు మగ్గురు కూతుళ్లు, ఇద్దరు అబ్బాయిలు, పెద్దమ్మాయికి చిన్నతనంలోనే వివాహం చేశారు.రెండో అమ్మాయి విజయ మంచిర్యాల కలెక్టరేట్ లో రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో సీనియర్ అసిస్టేంట్ గా విధులు నిర్వహిస్తుంది. మూడో అబ్బాయి కృష్ణ సీసీసీలోని ఆంధ్రా బ్యాంకు లో అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.నాలుగో అబ్బాయి మహేందర్ కాగజ్ నగర్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.ఐదో అమ్మాయి లక్ష్మీ చదువుపై శ్రద్ద లేకపోవడంతో గృహిణిగా ఉంది. తండ్రి లేకపోయిన కృంగిపోకుండా పిల్లలకోసం ఎంత కష్టమైన భరించి వారిని ఉన్నంత స్థానంలో నిలిపిన సారమ్మను పలువురు అభినందించారు.1992లో ఉద్దోగంలో చేరి అప్పటి నుండి నేటి వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా ఉద్యోగం చేయడం గొప్పవిషయమని పలువురు అబినంధించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.