వేములవాడ నేటి ధాత్రి
వేములవాడ మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులకు ఘనంగా వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సన్నిధి వెంకట కృష్ణ హాజరై సరస్వతీ దేవికి దీపాలు వెలిగించి ప్రార్థనలు చేయడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు ప్రతి విద్యార్థి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు ఆనంద ఉత్సవాల మధ్య ఫుట్ టాపింగ్ నంబర్లపై నృత్యం చేశారు
విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి గడిపిన సంవత్సరాలకు మరియు ఆనందకరమైన క్షణాలను గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమానికి అంకితం చేయబడింది విద్యార్థులు వినోదం చదువుల మధ్య సమతుల్యతను పాటించాలని కృష్ణవేణి టాలెంట్ పాఠశాల చైర్మన్ ఎస్ రాజు వీడియో కాల్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన ఆశీర్వదించారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు