`తప్పుడు ప్రచారాలకు పాల్పడేది తప్పు చేసివారే
`సామాన్యుల మద్దతు ప్రభుత్వానికి పుష్కలం
`అవినీతి పర్వతాన్ని బద్దలు కొడితే తప్ప హైడ్రా లక్ష్యం నెరవేరదు
`కోర్టులను కవచంగా వాడుకోవాలనుకున్నా, నిజాయతీ ముందు తలవంచాల్సిందే
`మీడియా మద్దతు మునిగే నావను కాపాడదు
`ప్రజాహితమే పరమ లక్ష్యమైనప్పుడు, అవినీతి ‘పాము’ తోకముడవాల్సిందే
`రేవంత్ సామర్థ్యానికి పరీక్ష హైడ్రా
హైదరాబాద్,నేటిధాత్రి:
హైడ్రా…ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మానసపుత్రిక! హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులు, సరస్సుల ప్రాంతాల్లోని భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వా రా నగరంలో గతంలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునరుద్ధరించడం ప్రధానలక్ష్యం. హైడ్రా తన కార్యకలాపాలను కొనసాగించే క్రమంలో ఆయా చెరువుల సమీపంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఎటువంటి సందేహాలకు తావులేకుండా కూల్చివేస్తూ, ఆక్రమణకు గురైన ప్రభు త్వ భూములకు విముక్తి కలిగిస్తూ ముందుకెళుతోంది. అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టినవారి లో కొందరు కోర్టులను ఆశ్రయించడంతో హైడ్రా దూకుడు కొంత మందగించిన మాటవాస్తవం. ఈవిధంగా ఆక్రమణలకు గురైన భూములకు విముక్తి కలిగించడం సామాన్యులకు ఆనందం కలిగిస్తుంటే, ప్రభుత్వ భూములను, చెరువుల సమీప ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించి పెద్ద నిర్మాణాలు చేపట్టిన బడాబాబులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దీంతో వారు ఏదోవిధంగా దీన్ని అడ్డుకోవడానికి అన్నిరకాల యత్నాలు చేస్తున్నారు. కోర్టులను ఆశ్రయించడం ఇందులో భాగమే. తమ నిర్మాణాలకు అనుమతులున్నాయి కదా అన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో అధికార్లు, గతంలో అటువంటి అక్రమ అనుమతులు జారీచేసిన అధికార్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అంతేకాదు ఇటువంటి అనుమతులు ఇవ్వడానికి జి.ఒ.లను సవరించిన వైనాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. అటువంటి అక్రమ జీవోలను ర ద్దుచేసి వాటి స్థానంలో సవరించిన జీవోలను జారీచేస్తే తప్ప ముందుకెళ్లే పరిస్థితి లేదన్న సంగతిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికార్లు ఈ ప్రక్రియలో తల మునకలుగా ఉన్నారు. ఇందంతా పూర్తయ్యే సరికి కొంతకాలం పట్టే అవకాశం వుండటంతో,హై డ్రా పనులు కొంత మందగించడం సహజం. ఈ సమయంలోనే విపక్షాలు, అక్రమ నిర్మాణదార్లు హైడ్రాపై సాధ్యమైనంతవరకు వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించి, ప్రజల్లో వ్యతిరేకత సృష్టిం చేందుకు అవసరమైన అన్ని అడ్డదారులను అనుసరిస్తున్నారు.
ఈ క్రమంలో మూసీ ఆక్రమణల తొలగింపు చర్యలను కూడా హైడ్రాకే అంటగట్టి ప్రచారం చే యడం ఒక దుష్టపన్నాగం మాత్రమే. మూసీ పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాల తొల గింపునకు హైడ్రాకు సంబంధం లేదు. మూసీనది సుందరీకరణ ప్రక్రియలో పాలుపంచుకుంటు న్నవి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే! కేవలం ప్రజలను తప్పుదోవ పట్టిం చి హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికే ఈ ప్రచారాలు. నిజం చెప్పాలంటే మూసీ సుందరీకరణపనులు చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నదంతే! ఇదిలావుండగా సందట్లో సడేమియా మాదిరిగా, ఎవరైనా అనారోగ్య కారణాలు లే దా మరే ఇతర సమస్యల వల్ల మరణిస్తే, ఆ పాపాన్ని కూడా హైడ్రాకే అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. ఇది మరీ దారుణం! పెద్ద బిల్డర్లు లేదా వ్యాపారుల్లో కొందరు తమ అక్రమ నిర్మాణాల ను ఏదోవిధంగా కాపాడుకోవడానికి, తమ తప్పుడు ప్రచారాలకు మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఉపయోగించుకోవడం దారుణం. పెద్దఎత్తున ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఆయా మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని తప్పుడు వార్తలు రాయించడానికి కూదా వారు వెనుకాడటంలేదు. మీడియాకు ప్రకటనలే జీవనాడి కనుక అసలు నిజాన్ని తొక్కిపట్టి తప్పుడు వార్తలను ప్రచారం చేయడంలో తమవంతు పాత్రను పోషిస్తున్నాయి. ఒక ఆటో డ్రైవర్ అనారోగ్య కారణాలవల్ల మరణిస్తే,హైడ్రా సంస్థ కూల్చివేతలతో మనస్తాపం చెంది మరణించాడని దినపత్రికల్లో రావడం కేవలం హైడ్రాను అప్రతిష్టపాలు చేసేందుకే తప్ప మరోటి కాదు. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాల్సివచ్చింది. నిజానికి గత ఆగస్టులో హైడ్రాను ప్రారంభించిన కొత్తల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికార్లకు ఆదేశాలు జారీచేశారు.
హైడ్రా తీసుకునే చర్యలు ముఖ్యంగా నీటితావులను, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిరది బడాబాబులే తప్ప సా మాన్యులు కాదు. సామాన్యులకు ఎకరాలకొద్దీ స్థలాలుండవన్న సత్యాన్ని గుర్తించాలి. సమస్య వుంటే కోర్టుల్లో ఎదుర్కొనడానికి ఎవరికీ అభ్యంతరం వుండదు. ప్రభుత్వం నిజాయతీగా పనిచే స్తున్నప్పుడు సామాన్యప్రజలు నూటికి నూరుపాళ్లు మద్దతునిస్తారు. వ్యతిరేకత వ్యక్తమయ్యేది కేవలం అక్రమాలకు పాల్పడిన వారి నుంచే. హైడ్రా విషయంలో తప్పుడు వార్తలు ప్రచారానికి అటువంటివారే కారకులు. ఏదోవిధంగా హైడ్రాపై అలజడి సృష్టించేందుకు వారు ఏ చిన్న అవకాశంవదులుకోరు! ప్రస్తుతం జరుగుతున్నదిదే!
నిజం చెప్పాలంటే రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య తీసుకోవడానికి, గతంలోని ఏ ప్రభు త్వాలు ముందుకు రాలేదు. అంత ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో వున్నవారిలో చాలామంది ఈ అక్రమాలకు పాల్పడినవారే! చర్యలకు ఉపక్రమిస్తే తన సీటుకే ఎసరు తెచ్చే స్థాయిలో అక్రమార్కులు బలంగా వుండటం వల్ల అనవసర చిక్కులు మనకెందుకని ఏ ముఖ్య మంత్రీ ఈ దిశగా సాహసం చేయలేదు. రేవంత్ గతంలోని నాయకుల మాదిరి కాదు. తలపెట్టిన కార్యాన్ని అంతు చూడకుండా వదిలిపెట్టడన్న సంగతి గత ఏడాది పాలనలో ఆయన నిరూ పించుకున్నారు. ముఖ్యంగా కప్పల తక్కెడలాంటి కాంగ్రెస్ పార్టీని నియంత్రణలో వుంచి, అధిష్టానాన్ని మెప్పించి ముందుకెళ్లడమంటే కత్తిమీద సాములాంటిదే. ఇంతటి సమర్థతను ప్రదర్శించింది గతంలో ఒక్క వై.ఎస్. రాజశేరరెడ్డి మాత్రమే! సొంత ఇంటిపై నియంత్రణ సాధించి, ప్రత్యర్థులపై పట్టు సాధించి రేవంత్ చేస్తున్న రాజకీయ సాహసయాత్రలో హైడ్రా ఒక భాగం. ఈ హై డ్రాను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంపై రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడివున్నాయి. బలంగా వేళ్లూనుకుపోయిన ధన దిగ్గజాల అక్రమాలను ఎదుర్కొని విజయం సాధిస్తే, రేవంత్ గొప్ప పేరును సంపాదించుకోగలరు. అంతేకాదు ఆయన కేవలం కాంగ్రెస్లో మాత్రమే కాదు, రాష్ట్రంలో తిరుగులేని నేతగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసు కోగలుగుతారు.
ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో, ‘మాటల మాంత్రికుడు’ కేసీఆర్ రాష్ట్ర పర్యటన చేసే అవకాశాలు మెండుగా వున్నాయి. ఆయన తనయుడు కేటీఆర్ కూడా పాదయాత్ర యోచనలో వున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికార పరమపద సోపానాన్ని అధిరోహించేందుకు పాదయాత్రలు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతున్నాయి. తన పర్యటన సందర్భంగా కేసీఆర్ మాటల తూటాలను, రేవంత్ తనదైనశైలిలో ఎదుర్కొనాలంటే హైడ్రా, మూసీనది ప్రక్షాళన కార్యక్రమాల్లో విజ యం సాధించడం తప్పనిసరి. అప్పుడు కేసీఆర్ మాటల ‘ఆగ్నేయాస్త్రాన్ని’ తన చేతల ‘వారుణా స్త్రంతో’ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఏది ఏమైనా ‘హైడ్రా’, ‘మూసీ’నది ప్రక్షాళన అనేవి రేవంత్ సామర్థ్యానికి, నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి గొప్ప అవకాశాలుగా చె ప్పవచ్చు.
కోర్టుల్లో కేసుల పుణ్యమాని హైడ్రా కార్యకలాపాలు కాస్త మందగించిన నేపథ్యంలో ప్రత్యర్థులు వివిధ రకాలుగా విమర్శనాస్త్రాలు సంధించడం సహజమే. దీన్ని రేవంత్ వైఫల్యంగా చిత్రీకరించడా నికి విపరీత ప్రయత్నాలు జరుగుతాయి. ఎవరి రాజకీయ వ్యూహాలు వారికుంటాయి కనుక, ఎవరు విజయం సాధిస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది.